ఏపీ బీజేపీ కొత్త చీఫ్ గా సోము వీర్రాజు నియామకంతో కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ కన్నా ట్వీట్ చేశారు.
“నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి నేతకు, బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో ట్వీట్ చేశారు.