మా డేటానే తెలంగాణ పోలీసులు చోరీ చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ… అర్థరాత్రి లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన దొంగ రిపోర్టుతో కేసు నమోదు చేసి ఉదయానికల్లా ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు చూసి హైకోర్టు చీవాట్లు పెట్టిందని కనకమేడల పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నేతల్లా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు వస్తే ఆ కేసును ఏపీకి బదిలీ చేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదని చెప్పారు. ఎన్నికల్లో గందరగోళాలు సృష్టించి చంద్రబాబును ఓడించేందుకే కేసునమోదు చేశారని పేర్కొన్నారు. బీజేపీ డైరెక్షన్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి చంద్రబాబును ఓడించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…