telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

నేడు రాజమండ్రిలో మావోయిస్ట్ కామేశ్వరి అంత్యక్రియలు

Kameshwari funeral at Rajamundry

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో నిందితురాలైన కామేశ్వరి అలియాస్ స్వరూప అంత్యక్రియలు ఈరోజు రాజమండ్రి కోటిలింగాల శ్మశానవాటికలో జరగనున్నాయి. బుధవారం ఒడిశా కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో స్పరూప కూడా ఉన్నారు.

కామేశ్వరిది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామం. ఆర్టీసీలో ఆమె కండక్టర్ గా పని చేశారు. మావోయిస్టుల పట్ల ఆకర్షితురాలైన ఆమె 2008-09లో మావోయిస్టుల్లో చేరింది. క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. మొన్నటి ఎన్ కౌంటర్ లో మృతి చెందింది.

Related posts