స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో పాల్గొన్న కమల్ పై ఓ వ్యక్తి చెప్పును విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని ముందుగానే గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమాన్ సేన కార్యకర్తలపై కేసు నమోదైంది. మొట్టమొదటి ఉగ్రవాది గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే అని కమల్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపాయి. ఈ నపథ్యంలోనే ఆయన పై చెప్పులదాడి చేసినట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..