telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రజినీ, కమల్

Rajinikanth-and-Kamal

లెజండ‌రీ ద‌ర్శ‌కుడు బాల చంద‌ర్ 2014లో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 100 సినిమాల‌కి పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాల చంద‌ర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. బాల‌చంద‌ర్‌ని ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు త‌మ గురువుగా చెప్పుకుంటారు. అయితే ఈ రోజు చెన్నైలోని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆఫీస్ పరిధిలో బాల‌చంద‌ర్‌ విగ్ర‌హాన్ని క‌మ‌ల్, ర‌జ‌నీకాంత్ క‌లిసి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన క‌మ‌ల్ సినిమాని ఏ నాడు మ‌ర‌వ‌లేదు. త‌న ప్ర‌తిభ‌ని చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. గురువారం లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌తో పాటు 60 ఏళ్ళ‌సినీ ప్ర‌స్థానానికి జ్ఞాప‌కంగా మూడు రోజుల వేడుక నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌మ‌ల్ త‌న తండ్రి శ్రీనివాస‌న్ విగ్రహాన్ని ప‌ర‌మ‌క్కుడిలో ఆవిష్క‌రించారు. నేడు చెన్నైలోత‌న సినీ గురువు కె. బాల‌చంద‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేసారు క‌మ‌ల్‌. ప్ర‌స్తుతం క‌మ‌ల్ భార‌తీయుడు 2 చిత్రంతో బిజీగా ఉండ‌గా, ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్ చిత్రం చేస్తున్నారు.

Related posts