భారతదేశంలో తొలి టెర్రరిస్టు హిందువే అని సినీ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పురాణాల్లో హిందూ మతమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.12 మంది ఆళ్వారులు కానీ, 63 మంది నయనారులు కానీ వారి కీర్తనల్లో హిందూ అనే పదాన్ని ఎక్కడా ఉచ్ఛరించలేదని చెప్పారు. విదేశీ పాలకులు హిందూ అనే పదాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
ఆ తర్వాత బ్రిటీష్ హయాంలో హిందూ అనే పదం అధికారికంగా వాడబడిందని తెలిపారు. మనకు ఎన్నో గుర్తింపులు ఉన్నప్పుడు, విదేశీయిలు ఇచ్చిన ఒక పదాన్ని మతంగా వాడాల్సిన అవసరం లేదని చెప్పారు. హిందువు అని పిలిపించుకునే కంటే భారతీయుడు అని పిలిపించుకోవడమే బాగుంటుందని కమలహాసన్ హితవుపలికారు.