కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం ఆశ్రమంతో పాటు తమిళనాడులోని 25 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. కల్కి ఆశ్రమ సీఈవో లోకేశ్ దాసాజీని కూడా ప్రశ్నిస్తున్నారు.
కల్కి ఆశ్రమంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఏక కాలంలో దాడులను నిర్వహిస్తున్నారు. ఆశ్రమం సీఈఓ లోకేశ్ దాసాజీతో పాటు ఇతర సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం 8 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఆశ్రమాల్లో ఐటీ దాడుల విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.