తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు చాలా లాభాలున్నాయని తెలిపారు.వచ్చే 20 ఏళ్ల వరకు కేసీఆర్ నాయకత్వానికి ఢోకాయే లేదని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా వచ్చాయని అన్నారు.
రాష్ట్రం వాటాగా కేంద్రం నుంచి రావల్సిన నిధుల కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.వారం రోజుల్లోగా నూతన సభ్యులను అధిక సంఖ్యలో పార్టీలో చేర్పించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యకర్తలందరూ కలిసి మెలిసి ఉంటూ పార్టీ అభివృద్ధి, పటిష్ఠత కోసం పాటుపడాలని నామా సూచించారు.