కరణ్ జోహార్ నిర్మిస్తున్న “కళంక్” సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. కొన్ని రోజుల క్రితమే టీజర్తో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన చిత్రబృందం ఈరోజు ట్రైలర్ను విడుదల చేశారు. ఓ ప్రేమకావ్యాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు “కళంక్” ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతి ఫ్రేమ్ లోని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయ్. ఈ సినిమాలో బాలీవుడ్ హేమాహేమీలు నటిస్తున్నారు. సంజయ్ దత్, మాధురి దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత మాధురీ దీక్షిత్, సంజయ్ దత్లు కలిసి నటిస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అభిషేక్ వర్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 17న “కళంక్” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post