హీరోయిన్ కాజల్ ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకుని ఆ తర్వాత కాజల్ తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొంటుందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ యూనిట్తో మరో వారంలో జాయిన్ అవుతుందని, దాని తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతానికి షూటింగుల పని పక్కన పెట్టి ముందు భర్తతో హనీమూన్కి వెళ్తోంది కాజల్. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. తమ పేరుతో ఉన్న పౌచ్లతో పాటు పాస్పోర్టుల పిక్ తీసి.. “బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో” అంటూ కామెంట్ చేసింది. అయితే హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారన్నది మాత్రం వెళ్లడించలేదు.
previous post