బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం “సీత”. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 24న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆమె తను తదుపరి చేస్తున్న, చేయబోతున్న సినిమాల గురించి కూడా తెలిపారు.
ప్రస్తుతం “సీత” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా శర్వానంద్తో చేస్తున్న మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యిందని, అలాగే తమిళంలో జయం రవితో చేస్తున్న చిత్రం కూడా షూటింగ్ పూర్తయిందని అన్నారు. ఇవిగాక తమిళంలో “ఇండియన్ 2″తో పాటు మరో సినిమా, తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేశానని తెలిపారు. ఇక “ఇండియన్ 2” సినిమా ఏమీ ఆగిపోలేదు. కమల్ హాసన్గారు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూట్ మధ్యలో బ్రేక్ వచ్చింది. త్వరలోనే “ఇండియన్ 2” షూట్ మళ్లీ మొదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను’’ అంటూ కాజల్ స్పష్టం చేశారు.