telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పైలట్‌ నిర్లక్ష్యం కారణంగానే కాచిగూడ రైల్ ప్రమాదం!

kachiguda station

కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ నిర్లక్ష్యం కారణంగానే కాచిగూడ రైల్ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైలును నిర్లక్ష్యంగా నడిపినందుకు ఐపీసీ సెక్షన్‌ 337, ర్యాష్‌డ్రైవింగ్‌ చేసి ఇతరులకు హానీ చేసినందుకు సెక్షన్‌ 338 కింద చంద్రశేఖర్‌పై పలు కేసులను నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రైలు ఒక ట్రాక్‌పై వెళ్లాల్సిందిగా, మరో ట్రాక్‌పై తీసుకువెళ్లి పైలెట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. మరోవైపు రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్‌–సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ఉదయం ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. డ్రైవరు ఇంజన్ లో ఇరుక్కుపోయాడు.

Related posts