ఏపీని సీఎం చంద్రబాబు నాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రభోదకుడు కెఏ పాల్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబును భూస్థాపితం చేస్తానని పాల్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పాటు చిన్న చిన్న పార్టీలన్నీ తనతో కలిసి రావాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు.