telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

కేఏ పాల్ ఫిర్యాదు.. నేడు విచారణకు ఆర్జీవీ?

Ram-Gopal-Varma

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశముంది.

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశారు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి పాల్ దిగిన ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఇటీవలే ఆయన ఫిర్యాదు చేశారు.

Related posts