సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. చంద్రబాబు తనకు వెన్నుపోటు పోడిచారని ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన సొంత మామ, మాజీ సీఎం ఎన్టీఆర్కు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు తనకు పొడవడం ఓ లెక్కా అంటూ పాల్ విమర్శించారు. చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురుకి ఓటెయ్యొద్దని అన్నారు. వాళ్లు తిరిగే హెలికాఫ్టర్కు వెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆయనలా మరెవరు అబద్దాలు చెప్పలేరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నీతి నిజాయతీ లేదని విమర్శించారు. నామా నాగేశ్వరరావు లాంటి వారు టీడీపీని ఎందుకు విడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నిత్యం తెలుగులో మాట్లాడే కేఏ పాల్ హిందీలో మాట్లాడుతూ నానా హంగామా చేశారు.
ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్