telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

టీడీపీ తో కలిసి..  కే.ఏ.పాల్ ప్రచారం.. 

indian christian political front on ka pal

కేఏ పాల్ ప్రజాశాంతి పేరిట పార్టీని పెట్టి, హెలికాప్టర్ గుర్తుపై అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎంత జోవియల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా, ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ, మార్గమధ్యంలో ఓ చోట తన కాన్వాయ్ ని ఆపిన వేళ, ఎదురు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, కేఏ పాల్ కు స్వాగతం పలికి, ఆయన వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.

కేఏ పాల్ టీడీపీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి, మరింత ఉత్సాహంతో వారితో కలిసి డ్యాన్సులేశారు. ఈ సందర్భంగా తనతో ఉన్న ఓ టీవీ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, తాను ప్రజలందరికీ తెలుసునని, తనకు ఓటేయాలని ఎవరినీ కోరడం లేదని, వారే తన వద్దకు వచ్చి ఓటేస్తామని చెబుతున్నారని అన్నారు. కేఏ పాల్ ప్రచార వీడియోను మీరూ చూడండి.

Related posts