telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీసీఎం జగన్ పీఏ గా.. నాగేశ్వరరెడ్డి ..

k.nageswarareddy as PA of APCM

కె.నాగేశ్వరరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా నియమితులయ్యారు. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 నుంచి జగన్‌తోనే ఉంటున్న నాగేశ్వరరెడ్డి స్వస్థలం కడప. వివిధ పత్రికల్లో పనిచేసిన ఆయన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు.

నాగేశ్వరరెడ్డి విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారు. వివిధ వర్గాలకు చెందిన నేతలతో జగన్ సమావేశాలు నిర్వహించడంలో నాగేశ్వరరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ తన పీఏగా నియమించుకున్నట్టు తెలుస్తోంది.

Related posts