తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ చేతుల మీదుగా బుధవారం ఉదయం ఆమె బాధ్యతలు చేపట్టారు. శ్రీ దేవి బదిలీకి ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన జస్టిస్ శ్రీదేవి, ఉత్తర్ప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్కు అఖిలభారత కోటాలో ఎంపికయ్యారు. అక్కడే వివిధహోదాల్లో పనిచేసి 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
previous post