telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత

Subhashan-Reddy
జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఉదయం  అనారోగ్యంతో మృతి చెందారు. గత నెల రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు.  ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారని ఆసుపత్రి  వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు. ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, న్యాయవాదులుగా రాణిస్తుండగా, మరొకరు ఇంజనీర్ గా ఉన్నారు.
గతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్‌ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌ లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నేటి సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

Related posts