telugu navyamedia
ఉద్యోగాలు

ఏపీలో జూనియర్‌ లైన్‌మెన్‌ కొలువులు..

APEPDCL తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఎలక్ట్రికల్, వైరింగ్‌ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయెన్సెస్‌ విభాగం లో రెండేళ్ల ఒకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ కోర్సు చేసిన పురుషులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు.

అర్హతలు..
జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌(ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌ /ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌)లో ఉత్తీర్ణత సాధించాలి.

వ‌య‌స్సు..
ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఫిట్నెస్ టెస్ట్ కి పిలవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్‌ 24, 2021.

ఎంపిక విధానం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష అక్టోబర్‌ 10 న ఉంటుంది. (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు). ఇది ఇలా ఉంటే రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్ట్‌ (విద్యుత్‌ స్తంభం ఎక్కడం, మీటర్‌ రీడింగ్‌ చూడటం, సైకిల్‌ తొక్కడం). నవంబర్‌ 1 నుంచి 6 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.apeasternpower.com/ వెబ్‌సైట్‌ లో చూసి.. అప్లై చేసుకోచ్చు.

రాత పరీక్ష
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్‌ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.

పోస్టుల వివరాలు..
శ్రీకాకుళం – 88, విజయనగరం – 74 , విశాఖపట్నం – 71, రాజమండ్రి – 122 ,ఏలూరు – 43 ఆస‌క్తి క‌ల‌వారు ఈ విధానం పాటించ‌వ‌చ్చు.

Related posts