బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికలో ఆ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, హోంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భావించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనైట్టెంది.
బీజేపీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రాధా మోహన్ సింగ్ ఆదివారం తెలిపారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం పోటీ నెలకొనే పరిస్థితి ఎదురైతే, ఆ మరుసటి రోజు ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఒక వ్యక్తి, ఒక పదవి అనే సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్ షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవాల్సి వస్తుంది.