telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

భార‌త రాజ్యాంగానికి 70 ఏళ్లు..ఈనెల 26న పార్ల‌మెంట్‌ స‌మావేశం!

parliament india

భార‌త రాజ్యాంగానికి 70 ఏళ్లు నిండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈనెల 26వ తేదీన పార్ల‌మెంట్‌లో ఉభ‌యస‌భ‌ల‌ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని మోదీ పార్లమెంట్ సభ్యులనుద్దేశించి మాట్లాడుతారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, లోక్‌సభ స్పీక‌ర్ ఓం బిర్లాలు కూడా సంయుక్త స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారు.

మాజీ రాష్ట్ర‌ప‌తులు, ప్ర‌ధానులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. సుమారు రెండు గంట‌ల పాటు పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో స‌మావేశం ఉంటుంది. స్వాతంత్య్రం వ‌చ్చి 50 ఏళ్లు నిండిన సంద‌ర్భంలోనూ 1997లో అర్థ‌రాత్రి ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హించారు. 1949, న‌వంబ‌ర్ 26వ తేదీన భార‌త రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జ‌న‌వ‌రి 26 నుంచి రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చింది.

Related posts