telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సలార్ లో విలన్ గా జాన్ అబ్రహం…

బాహుబలి తర్వాత సాహోతో అందరిని అలరించిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీని తరువాత కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయనున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమాకు సలార్ పేరును ఫిక్స్ చేశారు. అయితే  ఈ సినిమాలో హీరోయిన్‌, విలన్ పాత్రధారులను వెతకడం కష్టం అయిపోయింది. ప్రభాస్ స్థాయికి తగ్గా హీరోయిన్, విలన్ అంటే బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో చాలా అరుదుగా ఉన్నారు. దాంతో ఈ పాత్రల కోసం నటులను వెతకడం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది. అయితే సలార్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విలన్ గురించి తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం రంగంలోకి దిగనున్నాడట. బాలీవుడ్ సినిమాల్లో హీరోగా చేసిన జాన్ ప్రభాస్ సినిమాలో విలన్ పాత్ర చేసేందుకు రెడీగా ఉన్నాడట. ప్రశాంత్ నీల్ హీరోను ఏరేంజ్‌లో ఎలివేట్ చేస్తాడో, అదే స్థాయిలో విలన్ పాత్రను కూడా ఎలివేట్ చేయగల సామర్థ్యం ఉన్న దర్శకుడు. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఓకే అయినట్లు కూడా టాక్ నడుస్తోంది.

Related posts