telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ పై సిరీస్ గెలుస్తాం అనే నమ్మకం ఉంది : ఆర్చర్

ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో ఆడుతుంది. అయితే ఇప్పటికే ఇందులో రెన్డు మ్యాచ్ లు పూర్తికాగా మూడో టెస్ట్ అయిన పింక్ బల్ టెస్ట్ రేపు ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన మొతేరా లో ప్రారంభం కానుంది. ఇక తాజాగా ఈ టెస్ట్ మ్యాచ్ పై ఇంగ్లాండ్ పేసర్ జాఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ… మేము ఈ సిరీస్ గెలుస్తాం అనే నమ్మకం తమకు ఉన్నది అని అన్నాడు. అయితే అందుకు ఈ మూడో టెస్ట్ చాలా కీలకం అని తెలిపాడు. ఈ మూడో టెస్ట్ లో మేము విజయం సాధిస్తే నాలుగో మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రా చేసుకుంటామని దాంతో సిరీస్ మా సొంతం అవుతుంది అని ఆర్చర్ అన్నాడు. కానీ ఈ మూడో టెస్ట్ లో గెలవడం చాలా కష్టం అని కూడా తెలిపాడు. అయితే ఈ మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లు భారత్ కు చాలా కీలకం. టీం నదియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే కనీసం ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి రెండో మ్యాచ్ డ్రా చేసుకోవాలి. అదే ఇంగ్లాండ్ వెళ్లాలంటే మిగిలిన ఈ రెండు మ్యాచ్లు తప్పకుండ గెలవాల్సిందే. అయితే ఈ రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా వెళ్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts