ఈనెల 27న హైదరాబాద్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. విజయ్నగర్కాలనీ, మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే ఈ జాబ్మేళాకు బెట్టర్ ప్లేస్, గతి -కేడబ్యూఈ, కిమ్స్ దవాఖానలు హాజరై ఉద్యోగార్థులను ఎంచుకోనున్నాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సహా జాబ్మేళాకు హాజరుకావాలని , వివరాలకు 82476 56356 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
బెట్టర్ప్లేస్లో డెలివరీ పార్ట్నర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు -100 ఖాళీలున్నాయని, ఎస్సెస్సీ చదివి ఉండాలని తెలిపారు. గతి -కేడబ్యూఈలో కస్టమర్ డెలివరీ ఎక్స్పర్ట్స్ ఉద్యోగాలు 25 కలవని, ఎస్సెస్సీ చదివి ఉండాలని పేర్కొన్నారు. కిమ్స్ దవాఖానలో ఎస్సెస్సీ, ఇంటర్ వారికి జీడీఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హెల్త్కేర్ బిల్లింగ్ ఉద్యోగానికి డిగ్రీ విద్యార్హత గల వారు అర్హులు, వీరికి 6 మాసాల పాటు శిక్షణనిస్తారని తెలిపారు.
సచివాలయాన్ని కూలగొట్టించడానికి కేసీఆర్ సిద్దమయ్యారు: రేవంత్ రెడ్డి