రేపు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధిసంస్థ ఆధ్వర్యలో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యులు నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి శ్రీకాంత్రెడ్డి తెలిపారు. బాలాజీ క్యాపిటల్ కంపెనీలోని పలు ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. వీరికి నెలకు 10వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఇస్తారన్నారు.
రామ్నగర్లోని నలంద డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన పత్రాలతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7989888299 నెంబరులో సంప్రదించాలన్నారు.