ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు, యువతకు మరింత దగ్గరయ్యేందుకు పోలీస్శాఖ కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈస్ట్ జోన్ పరిధిలోని సైదాబాద్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చంపాపేటలోని లక్ష్మి గార్డెన్లో మెగా జాబ్ కనెక్ట్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్మేళాను ఈస్ట్ జోన్ డీసీపీ, నగర జాయింట్ కమిషనర్ రమేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.
పదవ తరగతి ఫెయిల్ అయిన వారి నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశం, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఉచితం. 20 కంపెనీలు 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయటానికి సంకల్పించారని, వివరాలకు 040-27854785, 94 90616391 లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు.
ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్.. పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు!