బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 16వ తేదీన దిశా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్మేళాకు హాజరు కావాలని వారు సూచించారు. వివరాలకు 7569732412లో సంప్రదించాలన్నారు.
ఒక ప్రకటనలో అధికారులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్)లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, ట్యాలీ ఈఆర్పీ9, బ్యూటీషియన్, యోగా తదితర తెలంగాణ ప్రభుత్వ సర్టిఫైడ్ కోర్సులు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, టైలరింగ్, జర్దోసీ (మగ్గం వర్క్), జ్యూట్ బ్యాగ్ మేకింగ్, బ్రైడల్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్ తదితర కోర్సులకు ఈ నెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీట్లు పరిమితమని, ముందు వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యతన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9951210441, 9398091395, 040-27098406 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరో వివాదంలో చిక్కుకున్న వనిత