telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

జియో మార్ట్… 200 పట్టణాల్లో ఆన్లైన్ గ్రాసరీ సేవల్లోకి ముకేశ్ అంబానీ

Jio-Mart

ముకేశ్ అంబానీ ఆన్‌లైన్ గ్రాసరీ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (RIL) చెందిన జియో మార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకిస్తూ అంబానీ జియో మార్ట్ సేవలు దేశవ్యాప్తంగా 200కు పైగా పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్రాసరీ రిటైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద జియో మార్ట్ సేవలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ జియో మార్ట్ సేవలు లాంచ్ కావడం విశేషం. ఈ అంశంపై దామోద్ మాట్లాడుతూ.. సంక్షోభాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అని ట్వీట్ చేశారు. సార్స్ వైరస్ సంకోభ పరిస్థితుల్లోనే అలీబాబా కూడా దూసుకొచ్చిందని సహోద్యోగి గుర్తు చేశారని పేర్కొన్నారు. అయితే మీ ప్రాంతంలో రిలయన్స్ జియో మార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. జియో మార్ట్ ద్వారా పండ్లు, కూరగాయలు, రైస్, పుప్పుధాన్యాలు, ఆయిల్, ప్యాకేజ్డ్ ఫుడ్, డెయిరీ ఐటమ్స్, పెట్ ఫుడ్, హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వంటివి అన్నీ కొనుగోలు చేయొచ్చు. జియో మార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లోని ప్రొడక్టుల ఎంఆర్‌పీ ధరపై 5 శాతం తగ్గింపు అందిస్తోంది. జియో మార్ట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆర్డర్ ఇవ్వొచ్చు. రెండు రోజుల్లో ప్రొడక్టులు డెలివరీ అవుతాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పేటీఎం, జియో మనీ, ఫోన్‌పే, యూపీఐ, మొబిక్విక్ ద్వారా బిల్లు చెల్లించొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. వాట్సాప్ పేమెంట్ లేదా వాట్సాప్ ద్వారా బుకింగ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Related posts