రిలయన్స్ జియో సంస్థ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి కొత్త కొత్త ఆఫర్లు ఇస్తుంటుంది. అయితే ఇది ప్రపంచ కప్ సమయం కాబట్టి, దానికి తగ్గట్టుగా క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో తాజాగా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచులను ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జి చేసుకోవాలి.
ఈ రీఛార్జి ప్రకారం 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందుతారు. దీనితో పాటు జియో వినియోగదారులు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుండి హాట్ స్టార్లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే, మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలలో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు కూడా లభిస్తాయి.