సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా “కౌన్ బనేగా కరోడ్పతి” షో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జార్ఖండ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ ప్రధాన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పాల్గొన్ని రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. ఆయన ఈ మొత్తాన్ని అమర జవానుల కుటుంబాలకు అందజేశారు. 1988 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్లో డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2016 వరకూ ప్రధాన్ జార్ఖండ్లో ఏడీజీ ఆపరేషన్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్సీట్లో కూర్చోవడం తనకు ఎంతో థ్రిల్లింగ్గా అనిపించిందన్నారు. కాగా ఈ కార్యక్రమం సోనీ టీవీలో సెప్టెంబరు 6న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
previous post
సీత” కోసం నాన్న మాట కాదన్నా : బెల్లంకొండ శ్రీనివాస్