ప్రముఖ వ్యాపార వేత్త, జెర్సీ పాల కంపెనీ వ్యవస్థాపకుడు బాల్రాజ్గౌడ్ గురువారం కన్ను మూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. బాల్రాజ్గౌడ్ రెండు దశాబ్దాల కాలం నుంచి పాల వ్యాపారంలో రాణించి వ్యాపార వేత్తగా ఎదిగారు. జెర్సీ పాల వ్యాపారాన్ని స్థాపించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
బాల్రాజ్గౌడ్ మై విలేజ్ మోడల్ విలేజ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించిన ఆయన కళాశాల అభివృద్ధి కోసం ఇటీవలే రూ.50 లక్షలు విరాళం అందించారు.
ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల