telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో.. మహారాష్ట్ర విద్యార్థికి టాప్ ర్యాంక్

job mela

జేఈఈ అడ్వాన్స్ డ్-2019 ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫలితాలను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఈ మేరకు ర్యాంకులు, ఎగ్జామ్ ఫైనల్ కీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. మహారాష్ట్రకు చెందిన కార్తికేయ చంద్రేశ్ గుప్తా ఓపెన్ విభాగంలో ప్రథమర్యాంకు సాధించాడు. బల్లార్ పూర్ కు చెందిన గుప్తాకు ఈ పరీక్షలో 372 మార్కులకు గాను 346 మార్కులు లభించాయి.

అలహాబాద్ కు చెందిన హిమాంశు గౌరవ్ సింగ్ రెండో ర్యాంకు, అర్చిత్ బుబ్నా (ఢిల్లీ) మూడో ర్యాంకు సాధించారు. ఇక, గాంధీనగర్ కు చెందిన తెలుగు విద్యార్థి దాసరి రాజేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో తొలి ర్యాంకు సంపాదించాడు. ప్రాంతాల వారీ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ పరిధిలో జిల్లెళ్ల ఆకాశ్ రెడ్డి టాప్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అమ్మాయిల్లో షబ్నమ్ సహాయ్ ప్రథమస్థానం సాధించింది.

Related posts