తెలంగాణ లో హైద్రాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నల్గొండ ,కరీంనగర్, వరంగల్, ఖమ్మం,నిజమా బాద్, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్ బాద్ పరీక్ష కేంద్రాలలో ఈరోజు నుండి ఈ నెల 26 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి ఉన్నాయి. మొదటి సారిగా ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. హిందీ,ఇంగ్లీషు, తెలుగుతో పాటు మరో 11 ప్రాంతీయ భాషలో ఈ పరీక్షా జరగనుంది. గతేడాది కోవిడ్ నిబంధనలు ఈ సారి కూడా వర్తిస్తాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షలు. ఉదయం 9 నుండి 12 గంటకు వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే నిర్ణిత సమయం కంట అరగంట ముందే పరీక్ష కేంద్రాల లో రిపోర్ట్ చేయాలి. పరీక్ష పత్రం లో మార్పులు…. ఈ సారి విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు ఛాయిస్ కోసం ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనున్నారు. తెలంగాణ లో 73 వేల 782 మంది విద్యార్థులు పరీక్షా రాయనున్నారు. నాలుగు సార్లు జేఈఈ మెయిన్ రాసే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ , మే లలో పరీక్షలు జరుగుతుతాయి. విద్యార్థి ఇష్టం మేరకు ఎన్ని సార్లైనా పరీక్ష రాయొచ్చు. తెలుగులో 374 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.
previous post