నిన్న కర్ణాటక విధానసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు.
సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినందుకుతాము విచారించడం లేదని వ్యాఖ్యానించారు. విశ్వాసపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓటమి విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదని అన్నారు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి తన శక్తివంచన లేకుండా కష్టపడ్డారని, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాటుపడ్డారని అన్నారు.