telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీలోకి జేడీ .. భీమిలి నుంచి పోటీ?

JD Laxminarayana filed nomination janasena

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరడం దాదాపుగా ఖరారైందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందని సమాచారం. తొలుత ఇక్కడి మంత్రి నారా లోకేశ్ పోటీ చేయాలని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో లోకేశ్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వోద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నించింది. ఆదివారం హైదరాబాద్‌లో లక్ష్మీనారాయణ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే జేడీ తెలుగుదేశంలోకి వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో జేడీ భేటీ అవుతారని సమాచారం.

Related posts