టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ రోజు సాయంత్రం ఆయన కడప జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జేసీ హైదరాబాదుకు బయలుదేరారు.
జేసీ ప్రభాకర్ కారు ఎక్కుతున్న సందర్భంలో ఆయన పీపీఈ కిట్ ను ధరించారు. ఆయన డ్రైవర్ కూడా పీపీఈ కిట్ ను ధరించడం గమనార్హం. కరోన చికిత్స కోసం ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరనున్నట్టు సమాచారం.