telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాలకు జేసీ గుడ్ బై!

టీడీపీ సీనియర్ నాయకుడు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు.సోమవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను కలిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ వాడేనని అన్నారు. మంచి ముఖ్యమంత్రిగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడే ఆయన పాలనపై విమర్శలు మంచి పద్ధతి కాదన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడన్నారు. చిత్తూరు జిల్లాలో చేపట్టిన రచ్చబండ పర్యటనకు వెళ్తూ వచ్చిన వెంటనే తనను, జానారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించారన్నారు. తాను ఎప్పుడూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా ద్వేషించలేదని చెప్పారు. ఎన్నికల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందనన్నారు. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Related posts