జయరాం హత్య కేసుకు సంబంధించిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. తొలుత రాజేశ్ తానే అప్పు కోసం హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ, పోలీసుల విచారణలో జయరాం భార్య పద్మశ్రీ చెప్పిన మరో కోణాన్ని తెరపైకి తెచ్చింది. 2016 నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, సొంత అక్కతోనే తనకు ప్రాణహాని ఉందని తన భర్త జయరాం తనతో చెబుతుండేవారని అన్నారు.
ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని జయరాం కేసులో మేనకోడలు అరెస్ట్…?
జయరాం బంధువుల నుంచే ఆయనకు ప్రమాదం వచ్చిందని, సమావేశాల నిమిత్తమే జయరాం అమెరికా నుంచి భారత్ కు వచ్చారని, ఇక్కడికి వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని అన్నారు. మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయం ఎక్కువ కావడంతో ఆమెను ఎక్స్ ప్రెస్ టీవీ ఛానెల్ బాధ్యతల నుంచి తప్పించిన విషయాన్ని పద్మశ్రీ ప్రస్తావించినట్టు సమాచారం.