ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఎన్నికల ఫలితాల పై స్పందించారు. తొలిసారి ముఖ్యమంత్రి కానున్న జగన్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఏపీలో కులాల కురుక్షేత్రం జరగుతోందన్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ నుంచి నిధులు తేలేని పక్షంలో పన్నులు మాఫీ చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. ఏపీలో టీడీపీ ఓటమికి జన్మభూమి కమిటీలే కారణమని జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధెవిధంగా రెండవసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదికి జేపీ అభినందనలు తెలిపారు.
భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: మోదీ