తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతుండగా, కొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. “శశి లలిత” టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగింది అనేది చూపించబోతున్నారు. మరోవైపు కోలీవుడ్లో జయలలిత జీవిత నేపథ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని “ది ఐరన్ లేడీ” పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ “తాను తలైవీ” అనే టైటిల్తో జయలలిత బయోపిక్ని తెరకెక్కిస్తున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వంద కోట్ల బడ్జెట్తో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుతుండగా, ఇందులో జయలలిత నట ప్రస్థానంతో పాటు రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు.
next post
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్