భారత క్రీడాకారిణి పి.వి.సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్కు చేరింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జపాన్ క్రీడాకారిణి అయా వోహ్రిని 11-21, 21-10, 21-13తో సింధు ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. తొలి గేమ్లో తడబడినా తర్వాత గేమ్ల్లో విజృంభించింది.
ఇక పురుషుల సింగిల్స్లో భారత్ షట్లర్ సాయి ప్రణీత్ కూడా క్వార్టర్స్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు.