ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. యూత్ఫుల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తన తాజా చిత్రం తెరకెక్కనుందని ఇటీవల పూరీ జగన్నాథ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. పూరీ, ఛార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో కథానాయికగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. జాన్వీ ఫేవరేట్ విజయ్ దేవరకొండ కాగా, ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అమ్మడు మిస్ చేసుకోదని అంటున్నారు. ఈ క్రమంలో పూరీ- విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతుందా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ తక్త్, కార్గిల్ గర్ల్, రూహ్ అఫ్జా అనే చిత్రాలతో బిజీగా ఉంది.