telugu navyamedia
సినిమా వార్తలు

హార్రర్ థ్రిల్లర్ లో జాన్వీ కపూర్

Janhvi Kapoor,Rajkummar Rao's horror comedy flick
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ “దఢక్” చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ తక్త్ అనే భారీ బడ్జెట్ చిత్రంతో పాటు ఐఏఎఫ్ తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ వారణాసిలో జరిగింది. ఇదిలా ఉండగా… తాజాగా జాన్వీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. “రూ ఆఫ్జా” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు హీరోగా నటించనున్నాడు.
హార్రర్ థ్రిల్లర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో వరుణ్ శర్మ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. హార్థిక్ మెహతా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను దినేష్ విజన్, మృగదీప్ సింగ్ లంబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 2019లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం మార్చి 20, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

Related posts