దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. అయితే జాన్వీ ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. జాన్వీ ఫ్యాషన్ సెన్స్కు ఆధునిక యువత ఫిదా అవుతున్నారు. తాజాగా జాన్వీ ముంబైలో ఫొటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. ఈ సందర్భంగా ఆమె వైట్ స్నీకర్స్, బ్లాక్ స్లింగ్ బ్యాగ్తో పాటు బాడీ కలర్ పెన్సిల్ డ్రెస్ ధరించింది. తక్కువ మేకప్ వేసుకుని, కురులను లూజుగా వదలివేసింది. ఆమెను చూసినవారంతా జాన్వీని హాలీవుడ్ నటి కిమ్ కర్డషియాన్తో పోలుస్తున్నారు. ఈ లుక్లో జాన్వీని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
previous post
సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు ? : పరిణితి చోప్రా