జనసేన ఎన్నికలు దగ్గరపడేసరికే దూకుడు పెంచేసింది. ఇప్పటికే పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో సిద్ధం చేసుకున్న ఆ పార్టీ వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా గ్రామ స్థాయిలో కూడా ఒక సేనను నియమించింది. దీనితో పార్టీ సిద్ధాంతాలను అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
గత కొన్ని రోజులుగా జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇప్పుడు గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్ర ఫర్ జనసేన టీమ్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు పవన్ తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలను కలిసి, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ టీమ్ ల లక్ష్యమని చెప్పారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలను కూడా క్షేత్ర ఫర్ జనసేన సభ్యులు నిర్వహిస్తారని తెలిపారు.
ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం: ఎంపీ కోమటిరెడ్డి