ఇటీవల కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.నంద్యాలలోని ఎస్పీవై కుటుంబాన్ని కలిశారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎస్పీవై రెడ్డి మే 1న హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. వరుసగా మూడు సార్లు నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవైరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
ఎస్పీవై మొదట భారతీయ జనతా పార్టీతో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1991లో జరిగిన నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీవైరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆ తరువాత బీజేపీ దూరమైన ఎస్పీవైరెడ్డి 1999లో జరిగిన ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీతో పాటు ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఒకేసారి రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. .2009లో నంద్యాల కాంగ్రెస్ ఎంపీగా 15వ లోక్సభకు ఎన్నికయ్యారు. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్ధిగా నంద్యాల నుంచి బరిలోకి దిగారు.