telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులపై ఉదారత చూపాలి: పవన్ 

pawan-kalyan

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగులపై ఉదారత చూపి, సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని తమ పార్టీ అభిప్రాయపడుతోందని అన్నారు.

సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు వస్తున్న వార్తలు తననుకలవరపెడుతున్నాయని పేర్కొన్నారు. నాడు సకలజనుల సమ్మెలో భాగంగా తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తుచేశారు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగసంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని అన్నారు.

Related posts