ఊపిరి ఉన్నంతవరకు పార్టీ నడుపుతానని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. వర్జీనియాలో ప్రవాసాంధ్రులతో జనసేన అధినేత పవన్కళ్యాణ్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 వరకు జనసేన పార్టీ ఉంటుందా అని కొందరు అడుగుతున్నారని వాళ్లకు చెప్పేదొకటేనని తనలో ఊపిరి ఉన్నంతవరకు పార్టీ కొంసాగుతుందని వ్యాఖ్యానించారు. డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని అన్నారు.
తానేవరికీ గులాంగిరీ చేయనని, ఆత్మగౌరవంతో ముందుకెళ్తానని చెప్పారు. గెలిస్తే పొంగిపోయి, ఓడిపోతే కుంగిపోయే నైజం తనది కాదన్నారు.రాజకీయ పార్టీ నడపాలంటే చాలా కష్టాలుంటాయని తెలుసని, ప్రజలకు అండగా నిలబడాలనే ప్రయాణం ప్రారంభించానని చెప్పారు. కోట్లాది మంది భవిష్యత్ను నిర్దేశించాలంటే అనుభవం కూడా కావాలన్నారు.