నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసైనికులు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్ ఫేయిల్డ్ యాస్ సీఎం తో పాటు సేవ్ నల్లమల అనే యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఇది ట్విట్టర్ ప్లాట్ఫాం నిబంధనలకి విరుద్దమని, ఈ కారణంగా ట్విట్టర్ యాజమాన్యం 400 మంది అకౌంట్స్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం పై పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పవన్ రియాక్షన్ కు ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చింది. సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది. రాజ్యాంగబద్ధమైన వ్యక్తీకర స్వేచ్చని సమర్ధించి త్వరగా రెస్పాన్స్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.